Header Banner

బైక్ ట్యాక్సీలు ఇక బంద్.. ఉబర్, ర్యాపిడోలకు బిగ్ షాక్ - హైకోర్టులో దక్కని ఊరట!

  Sun Jun 15, 2025 22:07        Business

ఈ రోజుల్లో చాలా మంది ర్యాపిడూ, ఉబర్, ఓలా లేనిదే అడుగు బయట పెట్టడం లేదు. అంతలా ఈ యాప్స్ జనజీవనంలో కలిసిపోయాయి. నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు ర్యాపిడో, ఉబర్ లు వాడుతుంటారు. ర్యాపిడో, ఉబర్ లో వెళితే సమయం ఆదా కావడంతో పాటు తక్కువ ఖర్చులో ప్రయాణం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు బిగ్ షాక్. జూన్ 16 నుంచి కర్ణాటక రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం నగరాల్లో ర్యాపిడో, ఉబర్ లాంటి బైక్ ట్యాక్సీ సేవలు ఊపందుకున్నాయి. మెట్రో నగరాల్లో అయితే నిత్యం వేల మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. సమయం ఆదాతో పాటు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చని ప్రజల అభిప్రాయం అయితే అలాంటి వారికి ఇప్పుడు కర్ణాటక హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. జూన్ 16 నుంచి బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేస్తూ తీసుకున్న కర్ణాటక సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ర్యాపిడో, ఉబర్ సంస్థలకు ఇది కోలుకోలేని దెబ్బగా భావించవచ్చు.

 

ఇది కూడా చదవండి: కేంద్రమంత్రి తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఇటీవల కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ర్యాపిడో, ఉబర్ లాంటి బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించింది. జూన్ 16 నుంచి రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ సేవలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసకుంది. బైకులను కమర్షియల్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలుగా వినియోగించ వద్దని సిద్ధరామయ్య సర్కార్ స్పష్టం చేసింది. అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బైక్ ట్యాక్సీలు తప్పు బట్టాయి. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించాయి. జూన్ 16 నుంచి బైక్ ట్యాక్సీలపై నిషేధం విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ర్యాపిడో, ఉబర్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నిషేధాన్ని నిలిపివేయాలని కోరాయి. అయితే హైకోర్టులో బైక్ ట్యాక్సీ సంస్థలకు ఎదురుదెబ్బ తగిలింది. సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. కర్ణాటక రవాణాశాఖ రూల్స్ ప్రకారం.. టూ వీలర్స్ ను వాణిజ్య సేవలకు వినియోగించకూడదన్న నిబంధనను హైకోర్టు సమర్థించింది. ఒకవేళ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు, హైకోర్టు ఉత్తర్వులను కాదని ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి దేశంలోనే టెక్ రాజధానుల్లో ఒకటైన బెంగళూరులో బైక్స్ ట్యాక్సీల రద్దుతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. మరి ఎంతకాలం ఈ నిషేధం కొనసాగుతుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

విజయ్ మాల్యా: అసలు సరే వడ్డీ, జరిమానాలు ఎవరు కడతారు? ఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చేతులెత్తేస్తే!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్‌ హెచ్చరిక!

 

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

 

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #Karnataka #Upholds #Bike TAxi Ban #Rapido #Uber #ViralNews #Business